పనిమనిషి కాళ్లు మొక్కుతానంటున్న రష్మిక.. రోజూ అదే పనట!

ప్రముఖ నటి రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తరువాత ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించింది. ఈ అమ్మడు తన నటనతో, అందంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం అన్ని భాషలలో తన సత్తా చాటుకుంటోంది. ఇక పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో నటించి నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.

రష్మిక మాట్లాడుతూ ‘ నేను ఉదయం లేవగానే పెంపుడు జంతువులతో ఆడుకుంటూ నా రోజును ప్రారంభిస్తాను. మనం మాట్లాడే తీరుని బట్టి బంధువులు, స్నేహితులు మనతో ఎంత కాలం ఉంటారో అర్ధం అవుతుంది. మన నోటి నుండి వచ్చే మాటలో ఏదైనా తేడా ఉంటే ఆ రోజే మన బంధం మనకు దూరం అవుతుంది. అందుకే నేను ప్రతి ఒక్కరిని చాలా గౌరవం ఇస్తాను. పనిమీద బయటికి వెళ్లి ఇంటికి వచ్చాక కచ్చితంగా ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళందరి కాళ్లు మొక్కుతాను. అంతేకాదు మా ఇంటి పనిమనిషి కాళ్లు కూడా మొక్కుతాను.
ఎందుకంటే నాకు ఎక్కువ తక్కువ అనే భావన ఉండదు. అందుకే నేను అందరిని సమానం గా చూస్తాను.” అని చెప్పింది.

ఈ ముద్దుగుమ్మ ఇంకా మాట్లాడుతూ.. “ఇక నా జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని డైరీ లో రాసుకోవడం నాకు అలవాటు. మనం సమాజంలో అనుసరించే పద్ధతులే మన విలువ ఏంటో తెలియజేస్తాయి’ అని తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది.