ప్రముఖ సినీ నటుడు, నందమూరి వారసుడు తారకరత్న కొద్ది రోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. కొద్ది దూరం నడిచే సమయానికి గుండె పోటుకు గురయ్యారు. దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడారు. తారకరత్న ఆ లోకాన్ని విడిచి నెల రోజుల గడుస్తున్నా.. ఆయన భార్య, పిల్లలు ఈ చేదు సంఘటను మరచిపోలేకపోతున్నారు.
తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తరచూ భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియాలో తన బాధను అందరితో పంచుకుంటోంది. తాజాగా తారకరత్న కూతురు నిష్కా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తండ్రితో తన చివిరి జ్ఞాపకాన్ని పంచుకుంది. తన తండ్రితో కలిసి సరదాగా గడిపిన వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో తారకరత్న తన కూతురు నిష్కాతో కలిసి ఆడుకుంటున్నారు.
ఒక గేమింగ్ సెంటర్ కు వెళ్లిన వీరిద్దరూ గేమ్ ఆడుతూ కనిపించారు. తారకరత్నకు గుండెపోటు వచ్చే ముందు రోజుదే ఈ వీడిమో అని నిష్క ఈ పోస్ట్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు నిష్కకు ధైర్యం చెబుతున్నారు. తారకరత్న భౌతికంగా దూరమైనా ఎప్పుడూ మీ వెంటే ఉంటారు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తారకరత్న చనిపోయిన తర్వాత ఆయన భార్య మరియు ముగ్గురు పిల్లల బాధ్యతలను నందమూరి బాలకృష్ణనే తీసుకున్నారు. వాళ్లకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు.
https://www.instagram.com/reel/CqIwFMmIs8P/?utm_source=ig_web_copy_link