న్యాచురల్ స్టార్ నాని తొలి పాన్ ఇండియా చిత్రం `దసరా` నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.
దసరా సినిమా ప్రారంభమైనప్పటి నుంచే ప్రేక్షకులను వీర్లపల్లి విలేజ్లోకి తీసుకెళ్లాడు దర్శకుడు శ్రీకాంత్ ఒదెల. అక్కడి ప్రజల కల్చర్, అలవాట్లు, ప్రవర్తనను కళ్లకు కట్టినట్లు చూపాడు. ఈ సినిమా ప్రధానంగా ధరణి, వెన్నెల, సూరి చుట్టూ తిరుగుతుంటుంది. స్నేహం, ప్రేమ, రాజకీయాలు చుట్టూ సాగే అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్.
ఈ సినిమాకు ప్రస్తుతం అన్ని వైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నాని, కీర్తి సురేష్ తమ కెరీర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారని.. సినిమా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి నాని, కీర్తి సురేష్ అందుకు రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది. ఇంతకు ముందు ఒక్కో సినిమాకు రూ. 12 కోట్ల రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకున్న నాని దసరాకు రూ. 15 కోట్లు ఛార్జ్ చేశారు. అలాగే మరోవైపు కీర్తి సురేష్ రూ. 3 కోట్లు లాగిందని టాక్ నడుస్తోంది. ఇక దసరా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తే వీరిద్దరూ తమ రెమ్యునరేషన్ ను మరింత పెంచే అవకాశం లేకపోలేదు.