శ్రీ‌రామ‌న‌వ‌మి స్పెష‌ల్‌.. `ఆదిపురుష్` నుంచి అదిరిపోయే అప్డేట్ వ‌చ్చేసిందోచ్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా మూవీ `ఆదిపురుష్‌`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇందులో సీతారాములుగా ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ న‌టించారు. సైఫ్ అలీ ఖాన్, హేమా మాలిని, సన్నీ సింగ్ ఇత‌ర కీక‌ల పాత్ర‌ల‌ను పోషించారు.

టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లపై నిర్మిత‌మైన ఈ చిత్రం ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల జూన్ 16కు పోస్ట్ పోన్ అయింది. ఇక‌పోతే నేడు శ్రీ‌రామ‌న‌వ‌మి పండుగ సంద‌ర్భంగా ఆదిపురుష్ నుంచి అదిరిపోయే అప్డేట్ వ‌చ్చింది. తాజాగా మేక‌ర్స్ `మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీ రామ్` అంటూ సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా ఉన్న శ్రీ రాముడు పోస్టర్‍‌ను విడుదల చేసింది.

ఎంతో నిండుగా ఉన్న ఈ పోస్టర్‌ అభిమానులను కనువిందు చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి టీజర్ రిలీజ్ అవ్వగా అది ఆడియన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అంతే కాదు ఎన్నో విమర్షలను కూడా ఫేస్ చేసింది. అయితే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం లైవ్లీగా ఉంది. ప్ర‌స్తుతం ఆదిపురుష్ తాజాగా పోస్ట‌ర్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.