తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో గర్వంగా చెప్పుకునే మహానుభావుడు, ఆల్ టైమ్ క్లాసికల్ ఇండస్ట్రీ హిట్స్ కి కేంద్ర బిందువు లాంటి దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ నిన్న మరణించారు. ఈ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ సినీ ప్రపంచం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆయన కడచారి చూపు కోసం తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం కదిలి వచ్చింది.
విశ్వనాధ్ తన దర్శకత్వంలో ఎన్నో గొప్ప సినిమాలను, ఎందరో స్టార్ హీరోలను డైరెక్ట్ చేశాడు. ఎందరో హీరోలతో కలిసి నటించాడు కూడా నటన గురించి ఆయనకు తెలిసినంత ఏ దర్శకుడికి తెలియదు అని అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి గొప్ప వ్యక్తికి ఒకరు నచ్చడం అంటే మామూలు విషయం కాదు. ఆయన జీవించి ఉన్న రోజుల్లో ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో నేటితరం హీరోలలో మీకు ఎవరు బాగా ఇష్టమని అడిగిన ప్రశ్నకు.. ఆయన ఇచ్చిన సమాధానం ఆ టైమ్లో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఉన్న హీరోలలో ప్రతి ఒక్కరు బాగా నటిస్తున్నారని, కానీ వారిలో నాకు ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ నటన అంటే బాగా నచ్చుతుందని, అలా అని మిగిలిన వారు బాగా చేయడం లేదని కాదు వారి నటన అంటే నాకు కొంచెం బాగా ఇష్టమని ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తో విశ్వనాధ్ నిన్ను చూడాలని, అల్లరి రాముడు సినిమాల్లో కలిసి నటించాడు. అల్లు అర్జున్తో కలిసి నటించకపోయిన స్వాతిముత్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా బన్నీని డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం అయన అన్న మాటలను బన్నీ, ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయనకి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.