టాలీవుడ్ లో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన RRR చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా రికార్డులను తిరగరాసి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ తమ ఇమేజ్ ని పెంచుకున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమాని మొదలు పెట్టబోతున్నారు. అయితే గత ఏడాది కొరటాల శివ రామ్ చరణ్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఆచార్య సినిమా ఫ్లాప్ గా మిగిలింది.
ఈ సినిమా డిజాస్టర్ టాక్ రావడంతో కొరటాల శివ కెరియర్ డిజాస్టర్ గా మారిపోయింది. ఈ సినిమా కారణంగా కొరటాల శివ చిరంజీవితో మాటలు పడవలసి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య సినిమా కంటే ముందు కొరటాల శివ కెరియర్లు నాలుగు బ్లాక్ బాస్టర్ హీట్ వేసుకున్నారు. దీంతో మళ్ళీ కొరటాల శివ తనని తాను ప్రూఫ్ చేసుకోవాల్సి వచ్చింది ఎన్టీఆర్, కొరటాల శివ మీద ఉన్న నమ్మకంతోనే ఒక ఏడాది పాటు మరొక సినిమాకు కమిట్ అవ్వకుండా వెయిట్ చేస్తున్నారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కొరటాల శివ కథ పైన దృష్టి పెట్టి పగడ్బందీగా స్క్రిప్టు తో మెప్పించినట్లుగా సమాచారం.
ఎందుకో కానీ ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కావడం ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఈ సినిమా నిర్మిస్తున్న యువ సుధా బ్యానర్ నుంచి కమింగ్ న్యూస్ అంటూ అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక తాజాగా వినిపిస్తున్న మాట ప్రచారం ఈ సినిమాకి సంబంధించి సముద్రానికి సెట్ హైదరాబాదులో వేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నెలలో మార్చి నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. మరి ఈ చిత్రంతో ఎన్టీఆర్ బయట పడతారెమో చూడాలి.