త్రివిక్రమ్ దగ్గర నుంచి సినిమా వస్తుంది అంటే అందులో కచ్చితంగా ఇద్దరు హీరోయిన్స్ కామనే. అయితే సెకండ్ హీరోయిన్ కు సినిమాలో అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. ఆమెను జస్ట్ సెంటిమెంట్ కోసమో, లేదా గ్లామర్ కోసమో తన సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా చూసుకుంటున్నాడు. గత కొంతకాలంగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఏ సినిమాలో అయినా సెకండ్ హీరోయిన్ ఇంపార్టెన్స్ క్లియర్ గా తెలిసిపోతుంది.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురం లో పూజా హెగ్డే తో పాటు నివేత్త పేతురాజ్ను సెకండ్ హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమాలో మాత్రం ఆమెకు రెండు మూడు సీన్స్ మాత్రమే డిజైన్ చేశాడు త్రివిక్రమ. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత లో కూడా పూజ హెగ్డే తో పాటు ఈషా రబ్బను కూడా సెకండ్ హీరోయిన్గా పెట్టుకున్నారు. ఆమె పరిస్థితి కూడా రెండు మూడు సన్నివేశాలకే పరిమితం చేశాడు.
నితిన్ – సమంత జంటగా నటించిన అఆ’ లో మాత్రం అనుపమకి కాస్త ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ సమంత కేరెక్టర్ ముందు అనుపమ పాత్ర తేలిపోయింది. ఇక ఇప్పుడు మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమాలో పూజా హెగ్డే తో పాటు శ్రీ లీలను కూడా మరో హీరోయిన్గా తీసుకున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే ఈ సినిమా ఓ షెడ్యూల్ షూటింగ్ ముగించుకుని రీసెంట్గా రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.
త్వరలోనే పూజ, శ్రీలీల ఈ సినిమా షూటింగ్లో అడుగు పెట్టబోతున్నారు. అయితే ఈ సినిమా విషయంలో పూజతో పాటు శ్రీ లీలకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటున్నాడట త్రివిక్రమ్. మెయిన్ హీరోయిన్ పూజ అనే కానీ ప్రస్తుతం శ్రీ లీలకు ఉన్న క్రేజ్ చూసి ఆమెకి కూడా మరిన్ని సన్నివేశాలు యాడ్ చేస్తున్నారని తెలుస్తుంది. రీసెంట్గా ఈ సినిమా నిర్మాత నాగవంశీ కూడా శ్రీ లీల సెకండ్ హీరోయిన్ కాదని, ఈ సినిమాలో ఇద్దరూ హీరోయిన్స్ ఉంటారని గట్టిగా చెప్పుకొచ్చాడు.
ఇక నిర్మాత చేసిన కామెంట్లు బట్టి చూస్తే త్రివిక్రమ్ ఈసారి రెండు పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ మహేష్ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఎవరు ఏమనుకున్నా ఇప్పుడు పూజ కంటే శ్రీ లీలకే ఎక్కువ క్రేజ్ ఉంది. రవితేజ హీరోగా వచ్చిన ధమాకా వసూళ్ల విషయంలో శ్రీ లీల క్రేజ్ బాగా ఉపయోగపడింది. ఆమెను చూడడానికి రిపీటెడ్ గా సినిమాలు చూసిన ఆడియన్స్ కూడా ఉన్నారు.
ఇప్పుడు మహేష్ కు జంటగా శ్రీ లీల అంటే ఈ జంట వెండితెరపై అదిరిపోవటం ఖాయమనే ఆసక్తితో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబుతో పూజ ఎప్పటికే మహర్షి సినిమాలో నటించింది. కాబట్టి ఈ కాంబో మీద ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేదు. ఇప్పుడు త్రివిక్రమ్ తన పాత సినిమాలు భిన్నంగా ఇప్పుడు తన ఆలోచనలు మార్చుకుని మహేష్ కోసం శ్రీ లీలకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేలా ఉన్నాడు.