ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒకటి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్లు నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే టాక్ పరంగా ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయినా.. ఫెస్టివల్ అడ్వాంటేజ్ తో బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ `వీర సింహారెడ్డి` డిజిటల్ స్ట్రీమింగ్ హక్కును సాలిడ్ ధరకు సొంతం చేసుకుంది.
అయితే తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ కు హాట్స్టార్ వారు డేట్ లాక్ చేశారు. ఈనెలోనే వీర సింహారెడ్డి ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఫిబ్రవరి 23 సాయంత్రం 6 నుంచి ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులో రాబోతోంది. ఈ విషయాన్ని హాట్స్టార్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇక థియేటర్లలో చూడని ప్రేక్షకులు, ఓటీటీ ఆడియెన్స్ కు ఇది గుడ్న్యూసే అని చెప్పొచ్చు.