వాణిజయరాం కు ఏ ప్రాబ్లమ్ లేదు..కానీ పిల్లలు పుట్టకపోవడానికి కారణం అదే..!?

సంగీత ప్రపంచంలోనే ఇది బ్లాక్ డే అని చెప్పాలి. ప్రముఖ స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న గాయని వాణి జయరాం కొద్ది గంటల క్రితమే మరణించారు . కాగా దాదాపు 14 భాషల్లో పదివేలకు పైగా పాటలు పాడి తన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వాణీజయరాం.. అనుమానస్పద స్థితిలో మరణించడం సినిమా ఇండస్ట్రీకి షాకింగ్ గా అనిపిస్తుంది . దీంతో వాణిజయరాం అభిమానులు ఆమె మరణం పై రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు .

ఇలాంటి క్రమంలోనే వాణి జయరాం కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా పద్మావతి, దొరైస్వామి అనే దంపతులకు ఐదవ సంతానంగా 1945 నవంబరు 30న తమిళనాడులోని వేలూరులో ఓ సంగీత కుటుంబంలో జన్మించారు వాణీజయరాం. వాణీ పుట్టగానే ఆమె తండ్రి ఓ సిద్ధాంతిని కలిసి జాతకం చూపించగా..ఆశ్చర్యపోయే విషయాలను బయటపెట్టారట. ‘మీ పాప భవిష్యత్తులో పెద్ద గాయని అవుతుంది”అంటూ అప్పుడేఅ చెప్పేసారట. ఆ మాట ని అర్ధం చేసుకోవడానికి వాణీ తండ్రికి చాలా టైం పట్టింది.

అయితే, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈమెకు పిల్లలు లేరు. అప్పట్లో అందరు ఈమెకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు..అంటూ హేళనగా మాట్లాడారట. అయితే..నిజానికి ఆమెలో ఏ ప్రాబ్లమ్ లేదట. ఆమె భర్తకి ఏదో సమస్య ఉందట. కానీ ఆ విషయాని బయట పెట్టకుండా..ఆ నింద ఆమె పై వేసుకునిందట. ఎవ్వరైన మీకు పిల్లలు లేరు గా అని అడిగితే.. ఆ లోటు తీర్చడానికే సంగీతం నాతో ఉంది అంటూ చెప్పుకొచ్చేదట. ఏది ఏమైన వాణీ జయరాం మరణం ఇండస్ట్రీకి తీరని లోటు..!!