తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు సందీప్ కిషన్ తాజాగా మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక గతంలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. అయితే గతంలో హీరోయిన్ రెజీనాతో కలిసి నాలుగు సినిమాలు తెరకెక్కించారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే వీరిద్దరూ ఒకే సమయంలో కెరీర్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. రెజీనా బర్త్ డే సందర్భంగా సందీప్ కిషన్ ఒక రొమాంటిక్ ఫోటోను కూడా షేర్ చేయడం జరిగింది.
ఫ్రెండ్లీ గానే లవ్ యు చెబుతూ బర్త్డే విషెస్ ని తెలియజేశారు.దీంతో ప్రేక్షకులు వీరిద్దరూ రిలేషన్ గురించి పలు వార్తలు వైరల్ గా చేశారు.ఇక కోలీవుడ్ మీడియాలో ఇద్దరీ గురించి హాట్ టాపిక్ గా మారిపోయారు. సందీప్ కిషన్ మైఖేల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన రిలేషన్షిప్ మీద స్పందించినట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్ మాట్లాడుతూ మాది 12 ఏళ్ల బంధం కలిసి నాలుగు సినిమాలు చేశాం అలాంటి ఫోటోలు మేము చాలానే దిగాము అందులో ఏముంది అంటూ తెలియజేశారు.
ఆ వార్తలు ఇతర మీడియా రాసింది కానీ తెలుగు వారు ఇలా రాయదు. మా గురించి రాసి రాసి వాళ్లకు బోర్ కొట్టేసింది. మా గురించి వాళ్ళకి తెలుసు మేము మంచి ఫ్రెండ్స్ అని ముంబైలో ఆమె షూటింగ్ ఆలస్యమైన ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చిన అక్కడ మా సిస్టర్ ఇంట్లో ఉంటుంది అంటూ తెలియజేశారు సందీప్ కిషన్. అంత క్లోజ్ని మా మధ్య ఉందంటూ కూడా తెలియజేయడం జరిగింది. దీంతో వీరిద్దరి మధ్య రూమర్స్ పై క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు. కేవలం మేమిద్దరం మంచి స్నేహితులమే అంటూ తెలిపారు.