ఫ్యామిలీ సినిమాలకు కాస్త యాక్షన్ జోడించి తెరకెక్కించడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి సిద్ధహస్తుడు. మహేష్ బాబుతో మహర్షి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ సంక్రాంతికి కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ తో వారసుడు సినిమా తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ ఈ సినిమా విడుదల దగ్గర నుంచి వంశీ పైడిపల్లి దర్శకత్వం గురించి ఎన్నో కామెంట్లు వస్తున్నాయి. సంక్రాంతి సీజన్, విజయ్ స్టామినా వల్లే వారసుడు సినిమా హిట్ అయిందనే ప్రచారం కూడా ఉంది.
వంశీ పైడిపల్లి తన సినిమాలతో దర్శకుడుగా కొత్తదనం చూపించలేకపోయారంటూ, టాలీవుడ్ లో మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథతోనే కోలీవుడ్లో విజయ్తో సినిమా తెరకెక్కించారంటూ కామెంట్లు కూడా వచ్చాయి. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు వంశీ పైడిపల్లి తన తర్వాత సినిమా ఏంటి అనే దానిపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. వారసుడు సినిమా అంత పెద్ద సక్సెస్ ఏమీ కాలేదు. ఈ నేపథ్యంలో వంశీకి స్టార్ హీరోలు అవకాశం ఇవ్వటం కష్టమే అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.
అయితే ప్రస్తుతం వంశీ తన తర్వాత సినిమా కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సినిమాను అల్లు అర్జున్తో చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు టాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం. అలాగే వీటితో పాటు ప్రభాస్ తో కూడా సినిమా చేయడానికి వంశీ పైడిపల్లి ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
ప్రభాస్ కూడా వరుస సినిమా షూటింగ్ లు చేస్తూ తీరిక లేకుండా ఉన్నాడు. ఇలాంటి సమయంలో వంశీ పైడిపల్లి వారికి స్టోరీ చెప్పి ఒప్పించడం కష్టమానే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. వంశీ ఇప్పటికే ప్రభాస్ తో మున్నా సినిమా తెరకెక్కించాడు. రామ్ చరణ్ తో ఎవడు సినిమా తెరకెక్కించిన వంశీ పైడిపల్లి ఆ సినిమాలోనే అల్లు అర్జున్తో కూడా ఓ గెస్ట్ రోల్ చేయించాడు.
ఈ విధంగా వంశీ పైడిపల్లి ఈ ఇద్దరు హీరోలని ఇప్పటికే డైరెక్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరోలు ఈ దర్శకుడికి అవకాశం ఇస్తారా ? లేక పక్కన పెడతారా అనేది చూడాలి. వంశీ పైడిపల్లి మాత్రం తన తర్వాత సినిమాని ఈ ఇద్దరి హీరోలతో చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.