ఆ స్టార్ హీరోతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ .. బాక్సులు బద్దల‌య్యే న్యూస్‌..!

సౌత్ ఇండియన్ ఫిలిం పరిశ్రమంలో ఉన్న హీరోలను అభిమానులు ఎంతలా ఆరాధిస్తారు అందరికీ తెలిసిందే.. అభిమానులు వారిని హీరోలుగా చూడటం మానేసి వారి సొంత కుటుంబ సభ్యులుగా చూస్తూ ఉంటారు మరి కొంతమంది దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారు. అలా సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అలాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్.

ఈ ఇద్దరి హీరోలు సినిమాలు వస్తే బాక్సాఫీస్ దగ్గర వాటి టాక్ తో సంబంధం లేకుండా మాస్ జాతర మొదలవుతుంది. అభిమానులు వారిని ఆరాధ్య దైవంగా కొలుస్తూ వారి సినిమాలకు హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు అందిస్తారు. ఇలాంటి సరి సమానమైన ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ కోరిక అతి త్వరలోనే నెరవేరబోతుందని కోలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన ఓ దర్శకుడు రీసెంట్గా అజీత్ ను కలిసి ఓ మల్టీస్టారర్ స్టోరీని వినిపించినట్టు తెలుస్తుంది. ఆ స్టోరీ అజిత్ కి ఎంతగానో నచ్చిందని, ఈ సినిమాలో మరో హీరోగా ఎవరిని అనుకుంటున్నారు అని ఆ డైరెక్టర్ ని అడగగా పవన్ కళ్యాణ్ అని చెప్పాడని.. ఆ మాట వినగానే అజిత్ ఎంతో ఆనందించాడని కోలీవుడ్ మీడియాలో ఈ వార్త జోరుగా వినిపిస్తుంది.

Pawan Kalyan-Ajith

గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఓ సినిమా ఇంటర్వ్యూలో భాగంగా అక్కడ అడిగిన ప్రశ్నకు.. మీకు అజిత్ కి కలిపి సోషల్ మీడియాలో మ్యూచువల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీ ఇద్దరి కాంబోలో ఓ సినిమా ఆశించవచ్చా అని అడిగిన ప్రశ్నకు.. పవన్ కళ్యాణ్ దానికి సమాధానం ఇస్తూ మంచి స్టోరీ తో ఎవరైనా నా దగ్గరికి వస్తే కచ్చితంగా సినిమా చేస్తానని బదిలించాడు. ఇలా ఆ ఇద్దరి సైడ్ పాజిటివ్ వైబ్రేషన్స్ రావటంతో ఈ ప్రాజెక్టు త్వరగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబో పై త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు రానున్నాయని తెలుస్తుంది.