ఫ్లాప్‌ డైరెక్టర్ తో క‌మిట్ అయినా చిరంజీవి..ఫస్ట్ టైమ్‌ సెన్సిటివ్ పార్ట్ ని టచ్ చేస్తున్న మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో 10 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ వచ్చి బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా దగ్గర నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా మారిపోయాడు. ఇక ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హీట్ ను తన ఖాతాలో వేసుకుని మరోసారి మెగాస్టార్ స్టామినా ఏంటో టాలీవుడ్‌కు చూపించాడు.

Waltair Veerayya Movie Review | Waltair Veerayya Review | Rating

ఇక ప్రస్తుతం చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే చిరంజీవి, వెంకీ కుడుములతో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు మెగాస్టార్ లిస్టులో మరో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ చేరాడు.

First look of megastar Chiranjeevi's 'Bhola Shankar' is out | Entertainment  News | English Manorama

ఇక మరి ఆ దర్శకుడు మరెవరో కాదు పూరి జగన్నాథ్-చిరంజీవితో ఓ భారీ సినిమాను చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే వీరిద్దరి మధ్య ఒకసారి స్టోరీ డిస్కషన్స్ జరిగాయని, ఆల్మోస్ట్ వీరిద్దరి సినిమా ఫిక్స్ అనేది టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

After Liger failure, Puri Jagannadh teases collaboration with Chiranjeevi.  Watch - Hindustan Times

కాగా ఈ విషయం గురించి అతి త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయట. నిజానికి చిరంజీవి రీ ఎంట్రీ సినిమానే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఆటో జానీగా రావాల్సి ఉంది. అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల నుంచి ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే దీనిపై అధికార ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.