సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. టాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాతో ఎంట్రీ వచ్చిన ఈ ముద్దుగుమ్మ తన తొలి సినిమాతోనే తెలుగులో సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం త్రిషకి మూడు పదుల వయసు దాటుతున్న వరుస సినిమాల్లో నటిస్తూ హీరోయిన్గా బిజీగా కొనసాగుతుంది.
ఇక గత సంవత్సరం కోలీవుడ్ బిగ్గెస్ట్ సినిమాగా వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి తన నటనతో అదరగొట్టింది. ఇక దీంతో మళ్లీ వరుస అవకాశాలను అందుకుంటూ సౌత్ ఇండియాలోనే బిజీగా మారిపోయింది. ప్రస్తుతం త్రిష కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కి జంటగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న లియో సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్గా మొదలవగా ప్రస్తుతం తొలి షెడ్యూల్ షూటింగ్ కాశ్మీర్ లో శరవేగంగా జరుగుతుంది.
ఈ సమయంలోనే అక్కడ జరిగే తొలి షెడ్యూల్ షూటింగ్ను త్వరగా పూర్తిచేసి తిరిగి రావాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ సమయంలోనే త్రిష తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తుంది. త్రిష అక్కడ చలికి తట్టుకోలేకపోవటంతో తీవ్రమైన జ్వరం వచ్చినట్టు అందుకే ఆమె తన పార్ట్ కి సంబంధించి షూటింగ్ను త్వరగా ముగించుకుని చెన్నైకి తిరిగి వచ్చిందని అంటున్నారు.
ఇకపోతే దాదాపు 14 సంవత్సరాల తర్వాత త్రిష విజయ్ తో జత కడుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మరొకవైపు ఈ సినిమా కార్తీక్ ఖైదీ సినిమాతో లింక్ అప్ అయి ఉంటుంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.