చిత్ర పరిశ్రమంలో ఉండే రిలేషన్స్ చాలా సున్నితంగా ఉంటాయి. అందులోనూ ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే వారి అవసరాలు సిద్ధపాటు అవుతూ ఉంటాయి. ప్రధానంగా థియేటర్స్ పంపకాలు, డిస్ట్రిబ్యూషన్ వంటి బిజినెస్ విషయాలలో నిర్మాతల మధ్య గొడవలు రాకుండా చూసుకుంటారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఓ చిన్న సంఘటనతో ఇద్దరు బడా ప్రొడ్యూసర్ల మధ్య గ్యాప్ వచ్చిందనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయానికి వస్తే.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమాకు సీక్వల్ రాబోతుంది అనే వార్త ఎంతో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ సినిమాను ఎవరు నిర్మించబోతున్నారు నిర్మాత ఎవరు ? అనే విషయం మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. గీత గోవిందం సినిమాను నిర్మించిన అల్లు అరవింద్ ఈ సినిమా సీక్వెల్ తీయాలంటే గీతా బ్యానర్ లోనే వస్తుంది అనుకున్నారు. కానీ ఇంతలో ఏమైందో తెలియదు గానీ మధ్యలో దిల్ రాజు ఎంట్రీ ఇచ్చాడు. ఎవరు ఊహించని విధంగా పరుశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో ఓ సినిమాను ప్రకటించాడు దిల్ రాజు. దీంతో అందరూ ఇది గీతగోవిందం సిక్వెల్ గా రాబోతుందని అందరూ అనుకుంటున్నారు.
దీంతో అల్లు అరవింద్ ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తుంది. నిన్న ఈ విషయంపై ప్రెస్ మీట్ కూడా అనౌన్స్ చేశారు. ఆ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ ఏం మాట్లాడుతాడా? టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. కానీ చివరికి ఈ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేశారు. అంతలోనే ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. టాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నిన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్ అనౌన్స్ చేసిన వెంటనే దర్శకుడు పరుశురామ్, అల్లు అరవింద్ అపాయింట్మెంట్ తీసుకుని ఆయనకి క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తుంది.
అల్లు అరవింద్ పరశురాం పై చాలా కోపంగా ఉన్నాడు. ఇక నువ్వు దిల్ రాజుతో ఎలా ? సినిమా చేస్తావో చూస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. వీటితోపాటు నేను చేయాల్సిన ప్రాజెక్టును దిల్ రాజు ఎలా చేస్తాడో అంటూ అతనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్తో దిల్ రాజు చేయబోయే సినిమా అప్డేట్స్ దొరకటం కూడా కష్టమే అని అంటున్నారు. ఇప్పటికే దిల్ రాజు టీమ్ అల్లు అరవింద్ ను కలిసి సద్ది చెప్పే ప్రయత్నాలు కూడా చేశారట. కానీ అల్లు అరవింద్ మాత్రం దిల్ రాజు పై.. పరుశురామ్ పై కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది.