వాల్తేరు వీరయ్య: బాబీ ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే .. సినిమా వేరే లేవల్..!!

టాలీవుడ్ సైలెంట్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో తెరకెక్కిన రీసెంట్ సినిమా వాల్తేరు వీరయ్య . టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ హీరోయిన్గా నటించింది . అంతేకాదు ఈ సినిమాలో మరొక హీరోగా మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఆయనకు జోడిగా అందాల ముద్దుగుమ్మ కేధరిన్ నటించారు . కాగా సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో కే పాజిటివ్ టాక్ అందుకుంది.

అంతేకాదు రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా దాదాపు 29 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది వాల్తేరు వీరయ్య. అయితే వాల్తేరు వీరయ్య కన్నా 24 గంటలు ముందు రిలీజ్ అయిన వీరసింహారెడ్డి సినిమా మాత్రం కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది . మొదటి రోజే యాభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసి ఎవ్వరికి అందనంత ఎత్తులో రికార్డులు క్రియేట్ చేసి పెట్టాడు బాలయ్య. చాలామంది వీరసింహారెడ్డికి – వాల్తేరు వీరయ్య సినిమాకి ఉన్న కంపారిజన్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు .

ఈ క్రమంలోని వీర సింహారెడ్డి సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ తమన్ సంగీతం అని ..ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ డూపర్ గా ఉందని ..వాల్తేరు వీరయ్య సినిమా విషయానికి వచ్చేసరికి కంటెంట్ పరంగా మెప్పించిన ..మ్యూజిక్ పరంగా ఫ్లాప్ అయిందని.. ఏదో దేవిశ్రీప్రసాద్ సినిమాకి మ్యూజిక్ ఇవ్వాలి అంటే ఇచ్చినట్లుందే కానీ.. ప్రాణం పెట్టి మ్యూజిక్ అందించలేకపోయాడని ..అదే సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ గా మారిందని బాబి. ఈ సినిమా విషయంలో కొంచెం కేర్ తీసుకొని మ్యూజిక్ డైరెక్టర్ని మార్చి ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేదని చెప్పుకొస్తున్నారు . దీంతో మెగా ఫాన్స్ దేవిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు..!!