`అర్జున్ రెడ్డి` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత `గీత గోవిందం` సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండకు తిరుగులేదని అందరూ భావించారు. కానీ గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపుల్లో విజయ్ మునిగిపోయాడు. ఈయన ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన `లైగర్` సినిమా సైతం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది.
లైగర్ పరాజయం తర్వాత పూరీ జగన్నాథ్ తో మొదలెట్టిన `జనగణమన`తో పాటు సుకుమార్ తో చేయాల్సిన సినిమా సైతం ఆగిపోయింది. దీంతో విజయ్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ వరుస ఫ్లాపుల్లోనూ విజయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు కొందరు దర్శకులు పోటీ పడుతున్నారు. ఆల్రెడీ `ఖుషి` అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉంది.
తాజాగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నాడు. సంక్రాంతి పండగ సందర్బంగా ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్ఛ్యూన్ ఫోర్ పతాకాలపై నాగవంశీ , సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు విజయ్ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ షాకిస్తోంది. ఎందుకంటే, ఈ మూవీకి విజయ్ ఏకంగా రూ. 45 కోట్ల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నాడట. బ్యాక్ టు బ్యాక్ ఫ్లుపుల్లోనూ విజయ్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.