బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈమె ఎలాంటి విషయాన్నైనా సరే ముక్కు సూటిగా తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన వైఖరిని మార్చుకోవడానికి భయపడి వెనకడుగు వేయదు. ఎప్పుడు కూడా క్వీన్ గానే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈమె గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. ఎమర్జెన్సీ టాకీ పూర్తి కాగానే సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు కంగన షేర్ చేయడం జరిగింది. ఈ సినిమా కోసం తన ఆస్తులు అన్నిటిని తాకట్టు పెట్టాల్సి వచ్చిందని తెలియజేస్తోంది.
మొదటి షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో డెంగ్యూతో బాధపడ్డారని తెలియజేసింది. ఆ తర్వాత ఎమర్జెన్సీలో కంగన దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించి సెట్ నుంచి ఈ మూడు ఫోటోలను కంగాన తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందిరాగాంధీ లుక్ తో మేకప్ అచ్చుగుద్దునట్లుగా కుదిరిందని ఈ ఫోటోలు కనిపిస్తున్నాయి.. తాను కెమెరా వెనుక కూర్చొని దివంగత ఇందిరా గాంధీ స్టైల్ లో మైక్రోఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తోంది. తన సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు తాను సురక్షిత స్థాయిలో ఉన్నానని తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని తన అభిమానులకు తెలియజేస్తోంది.
తన అనుభవాలతో సుదీర్ఘ నోట్ నే ఇంస్టాగ్రామ్ లో రాసుకుంది. నేటితో నటిగా ఎమర్జెన్సీ ని ముగించాను తన జీవితంలో ఒక మహత్తరమైన ఘట్టం పూర్తయిందని నేను హాయిగా ప్రయాణించినట్లు అనిపిస్తోందని తెలియజేస్తోంది. కానీ నిజం దానికి దూరంగా ఉంది నా ఆస్తులు అన్నిటిని తాకట్టు పెట్టడం నుండి నేను మొదటి షెడ్యూల్ తో డెంగ్యూతో బాధపడిన పరిస్థితుల్లో రక్త కణాల సంఖ్య తగ్గడంతో షూటింగ్ కి వెనుకాడ లేదు. ఒక వ్యక్తిగా తీవ్రంగా పరీక్షకు గురయ్యాను అంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ లెటర్ని రాసుకొచ్చింది. సినిమా అంటే అంతలా పిచ్చితోనే తాను ఇలా చేసిందని చెప్పవచ్చు..
View this post on Instagram