నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం `వీర సింహారెడ్డి`. ఇందులో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
అయితే మిక్స్డ్ టాక్ లభించినా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దుమ్ము దుమారం రేపుతోంది. రూ. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను రాబడుతోంది. విడుదలైన పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్ వ్యాప్తంగా రూ.61.95 కోట్ల షేర్ ను అందుకుంది.
అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 72.24 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ కు ఇంకా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా రూ. 1.76 కోట్ల షేర్ను అందుకోవాల్సి ఉంది. ఇక ఏరియాల వారీగా వీర సింహారెడ్డి పది రోజుల టోటల్ కలెక్షన్స్ ను గమనిస్తే..
నైజాం: 16.26 కోట్లు
సీడెడ్: 15.70 కోట్లు
ఉత్తరాంధ్ర: 7.14 కోట్లు
తూర్పు: 5.37 కోట్లు
పశ్చిమ: 4.03 కోట్లు
గుంటూరు: 6.18 కోట్లు
కృష్ణ: 4.48 కోట్లు
నెల్లూరు: 2.79 కోట్లు
—————————————–
ఏపీ+తెలంగాణ= 61.95 కోట్లు(100.15 కోట్లు~ గ్రాస్)
—————————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 4.64 కోట్లు
ఓవర్సీస్: 5.65 కోట్లు
—————————————-
వరల్డ్ వైడ్= 72.24 కోట్లు(121.05 కోట్లు~ గ్రాస్)
—————————————-