“నీలో అది లేదు సామ్”.. నెటిజన్ ప్రశ్నకి సమంత ఇచ్చిన ఆన్సర్ వింటే దండం పెట్టాల్సిందే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండిందో అందరికీ తెలిసిందే . పెళ్లికి ముందు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కూడా సమంత అంత యాక్టీవ్ గా లేదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి . అయితే విడాకుల తర్వాత ఎప్పటికప్పుడు జనాలతో చిట్ చాట్ చేసిన సమంత .. గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంది . దానికి కారణం కూడా మనందరికీ తెలిసిందే .

మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత ..ఆ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి దక్షిణ కొరియా వెళ్ళింది. కాగా రీసెంట్ గానే సమంత ఇండియాకు తిరిగి వచ్చింది . ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా “శాకుంతలం” . టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ సమంత శకుంతల దేవి పాత్రలో నటించింది . రీసెంట్ గానే ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లాంఛ్ ఈమెంట్ లో సమంత చాలా డల్ గా కనిపించింది.

దీంతో సమంతకు ఏమైంది అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు . మరి కొంతమంది ఆమెలో ఇదివరకు ఉన్నటి చార్మ్ లేదని ..విడాకుల బాధ నుంచి గట్టిగా కోలుకున్న సమంతను మయోసైటీస్ అనే వ్యాధి బాగా దెబ్బ కొట్టినట్టు కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే సమంత వాటి పై స్పందించింది . ” నేను ఏవైతే ఇన్ని నెలల్లో మందులు తీసుకున్నానో, ట్రీట్ మెంట్స్ అందుకున్నానీ వాటి జోలికి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఎప్పుడు వీక్ అవ్వకూడదు.. ఆరోగ్యంగా బాగుండాలని ఆ చాఎం నీ ఫేస్ లో ఉండాలని నేను నీకు ప్రత్యేక ప్రేమను పంపిస్తున్నాను “అంటూ రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే సమంత అతగాదికి ఘాటుగానే జవాబు ఇచ్చింది అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు . అయితే సమంత ఏ ఉద్దేశంతో అన్నా సరే ఆమె చెప్పిన మాటలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!