తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం టెంపర్. ఈ చిత్రం అటు పూరి కెరియర్ను ,ఎన్టీఆర్ కెరియర్ను ఒక్కసారిగా మలుపు తిప్పిందని చెప్పవచ్చు. పూరి మార్క్ ఎన్టీఆర్ నట విశ్వరూపం ఈ సినిమాకు విజయాన్ని అందించాయి. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాలో మరొక కీలకమైన పాత్రలో నటించారు నటుడు పోసాని కృష్ణ మురళి. ఇందులో కానిస్టేబుల్ మూర్తిగా నటించారు. అయితే ఈ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు.
టెంపర్ సినిమాలో పోసాని, ఎన్టీఆర్ మధ్య సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. సినిమా విజయంలో పోసాని కూడా కీలకమైన పాత్ర పోషించారు. ఇంత పాపులర్ అయిన ఈ పాత్ర కోసం మొదట పూరి జగన్నాథ్ అనుకున్నది పోసానిని కాదట. ఎన్నో విభిన్నమైన చిత్రాలలో పాత్రలలో నటించిన పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తినట .ఈ పాత్ర కోసం ముందు అనుకున్నారట. అందుచేతనే ఈ పాత్రకు మూర్తి అనే పేరు కూడా పెట్టారట పూరి జగన్నాథ్. కానీ ఈ సినిమాలో నటించమని నారాయణ మూర్తి ని అడగగా తను నటించలేదట.
ఇదంతా ఇలా ఉంటే అసలు నారాయణమూర్తి ఆ పాత్ర ఎందుకు చేయలేదని విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.. ఆ పాత్ర నేను చేస్తే సినిమా ఆడేస్తుందని పూరి జగన్నాథ్ తనకు ఆ ఆఫర్ ఇవ్వలేదు..నాతో ఆయన ఒక డిఫరెంట్ వేషం వేయించాలనుకున్నారు ఆ క్యారెక్టర్ నాకు ఉపయోగపడాలని ఆ నిర్ణయం తీసుకున్నాడు కానీ గొప్ప పాత్రను ఇవ్వాలనుకున్న పూరికి నా సెల్యూట్ అని చెప్పుకొచ్చారు. మొదట జూనియర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ను మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోగా ఎన్నో సినిమాలలో చేశాను.. మళ్లీ ఇలాంటి సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెనక్కి వెళ్లాలనుకోలేదని నారాయణమూర్తి తెలిపారు.