దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాల తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా త్రిబుల్ ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో మరో అద్భుతాన్ని సృష్టించాడు.
ఈ సినిమాలోని ప్రతి పాట కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ముఖ్యంగా కొమరం భీముడు సాంగ్ అయితే మరింత స్పెషల్ సినిమాను మలుపు తిప్పే ఈ పాటలో ఎన్టీఆర్ నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ పాట వింటుంటే ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. ప్రేక్షకులకే కాదు ఈ పాట రాజమౌళికి కూడా ఎంతో ఇష్టమట. ఇక రీసెంట్గా అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో త్రిబుల్ ఆర్ స్క్రీనింగ్కు హాజరయ్యాడు రాజమౌళి, తారక్.
ఈ క్రమంలోని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. ఇక తాను తెరకెక్కించిన సినిమాలలో కొమరం భీముడు పాట కానీ, ఆ సన్నివేశం కానీ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. ఆ పాటలో కెమెరామెన్ జూమ్ చేసి తారక్ కొనుబొమ్మ మీద పెట్టిన సరే ఆ కనుబొమ్మ కూడా పర్ఫామ్ చేసింది.. అంత గొప్ప నటుడు తారక్ అని జక్కన్న ప్రశంసలు కురిపించాడు.
ఇక ఇప్పుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ సినిమా అంతర్జాతీయ లెవెల్ లో కూడా ఎన్నో అవార్డులను అందుకుంటూ భారతీయ సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకువెళ్లింది. రాజమౌళి ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నాడు.