`వాల్తేరు వీర‌య్య‌` విడుద‌ల‌లో బిగ్ ట్విస్ట్‌.. తేదీ మార‌బోతోంది..?!

ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి అప‌జ‌యాల అనంతరం మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న చిత్రం `వాల్తేరు వీరయ్య` ఈ సినిమాపై చిరు ఎంతో నమ్మకంగా ఉన్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, సాంగ్స్‌, టీజ‌ర్‌, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ ను పెంచుతున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

అదేంటంటే వాల్తేరు వీరయ్య విడుదలలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోబోతుందట. మేకర్స్ ఈ మూవీ విడుదల తేదీని మర్చబోతున్నారట. జనవరి 13న కాకుండా 11నే విడుదల చేయాలని భావిస్తున్నారట. జనవరి 12న రిలీజ్ కాబోయే వారసుడు 14కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే వాల్తేరు వీరయ్యను 11 కు షిఫ్ట్ చేస్తే థియేటర్స్ భారీగా దొరుకుతాయని.. ఓపెనింగ్స్‌ అదిరిపోతాయని నిర్మాతలు అనుకుంటున్నారట. దీనిపై అధికారిక ప్రకటన సైతం రానుందని అంటున్నారు.