పాపం..సమంత లాగే భయంకరమైన వ్యాధితో పోరాడుతున్న శృతి..ఆ లక్షణాలు ఇవే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే . తను ఫస్ట్ టైం నటించిన పాన్ ఇండియా సినిమా యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఓపెన్ గా చెప్పేసింది . దక్షిణ కొరియాలో ట్రీట్మెంట్ తీసుకున్న సమంతా రీసెంట్గా తన నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇండియా చేరుకుంది.

అంతేకాదు సినిమా ప్రమోషన్స్ లోను సమంత చాలా డల్ గా నిరసించిపోయి కనిపించడం అభిమానులను మరింత కలవెర పెడుతుంది. అంతేకాదు సమంత పై వస్తున్న నెగటివ్ కామెంట్స్ కి కూడా ఘాటుగా జవాబిస్తుంది . ఇలాంటి క్రమంలోని వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్యకు హీరోయిన్గా నటించిన శృతిహాసన్ కూడా మరో భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది . స్టార్ డాటర్ గా పేరు సంపాదించుకున్న శృతిహాసన్ ..కమలహాసన్ ముద్దుల కూతురు అన్న సంగతి అందరికీ తెలిసిందే.

కాగా ఎప్పుడో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన శృతి హిట్లు ప్లాపులు అంటూ తేడా లేకుండా వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ తనదైన స్టైల్ లో ముందుకు పోతుంది . రీసెంట్గా శృతిహాసన్ బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో ఆయనకు జోడిగా నటించింది . ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో శృతిహాసన్ పేరు కూడా మారుమ్రోగిపోతుంది.

ఈ క్రమంలోని శృతిహాసన్ భయంకరమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు దీనికి సంబంధించి ఆమె ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందట . శృతిహాసన్ కి మొదటి నుంచి కోపం ఎక్కువే .. అయితే ఈ జబ్బు వచ్చాక విపరీతమైన కోపం పెరిగిపోతుందట . అంతేకాదు ఎక్కడ ఎవరైనా సరే ఆమెకి ఇష్టం లేని పని చేస్తే ఫుల్ రైజ్ అయిపోయి ఎంతటి వ్యక్తినైనా హద్దుల మీరి మాట్లాడేస్తుందట . అంతేకాదు ఉన్నట్టుండి కోపానికి గురవడం సహనాన్ని కోల్పోవడం కొన్ని సందర్భాలలో ఫుల్ ఆవేశానికి గురైపోయి చెమటలు పట్టేయడం లాంటివి జరుగుతూ ఉంటాయట . అందుకే దీనికి సంబంధించి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ తీసుకుంటుంది శృతిహాసన్ అన్నట్లు తెలుస్తుంది . పాపం ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ ఇలా వరుసగా రోగాల బారిన పడడం ఇండస్ట్రీలో ఫ్యాన్స్ కు మింగుడు పడడం లేదు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)