చిరు- బాలయ్య డాన్స్ గురించి శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

సంక్రాంతి పండుగ వస్తుందంటే సినిమా పరిశ్రమలో జాతర అని చెప్పాలి. ఇక ఈ జాతరలో పెద్ద హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నువ్వా నేనా అంటూ పోటీ పడతారు. ఇక ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి- బాలకృష్ణ కూడా తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ పోటీ లో ఈ విజయం ఎవరికీ దక్కుతుందో అని ఇద్దరి హీరోల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చిరంజీవి- బాలకృష్ణ ఇద్దరు ఈ సంవత్సరం ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు.

ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాలలోను హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తుంది. అయితే ఈ సినిమాలు విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమాల‌ యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ కార్యక్రమాల్లో శృతిహాసన్ కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

ఆ ఇంటర్వ్యూలో ఈ సినిమాల్లో డాన్స్ పరంగా ఎవరు బాగా చేశారు అనే ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ… మాస్ స్టెప్పులు బాలకృష్ణ అదరగొట్టాడు అంటూ సమాధానం వచ్చింది.. క్లాస్ మాస్ కలిపి ఇరగ్గొట్టడంలో చిరంజీవ కేక అంటూ సమాధానం చెప్పుకొచ్చింది. ఇలా శృతిహాసన్ ఇద్దరి హీరోల అభిమానులను హార్ట్ కాకుండా ఇద్దరినీ సమానంగా భావిస్తూ డాన్స్ విషయంలో శృతిహాసన్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.