నందమూరి బాలకృష్ణ 2021 చివరలో అఖండ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుని సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో వీర సింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్టు తెలుస్తుంది. బాలకృష్ణ గత చిత్రం అఖండ సినిమాకు ఏకంగా రూ.56 కోట్ల వరకు బిజినెస్ జరగక.. ఇక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఇప్పుడు వీర సింహారెడ్డి రూ.76 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా అత్యధికంగా నైజాం ఏరియాలో 22 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. సీడెడ్లో 15 కోట్లు, ఈస్ట్లో ఐదు కోట్లు, గుంటూర్లో ఆరు కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా ఈ లెక్కలపై అధికార ప్రకటన బయటకు రావాల్సి ఉంది. టాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇది. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా నిర్మాతలకు ఇది బంగారు బాతు గుడ్డే. ఈ సినిమాతో బాలకృష్ణ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.