బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు షారుక్. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ స్పై యాక్షన్ సినిమా రూపొందింది. సక్సెస్ లేని బాలీవుడ్కు కష్టాలు తీర్చే సినిమాగా అవుతుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్న ఈ సినిమాలో షారుక్ ఖాన్ కు జంటగా దీపికా పదుకొణే నటిస్తుంది.
బాలీవుడ్ మరో హీరో జాన్ అబ్రహం ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. గత ఆరు సంవత్సరాలుగా హిట్ అనే మాటకు ఆమడ దూరంలో ఉన్న షారుఖ్ ఖాన్.. పఠాన్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లవ్ లో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అంటే అదే స్థాయిలో ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా ఉండాలి, ప్రతి ఏరియాలోనూ తిరిగి..ఈ సినిమాను ప్రమోట్ చేయాలి. అయితే ఇదే విషయంలో షారుఖ్ ఖాన్ కి ఒక కండిషన్ ఉంది.
అది ఏమిటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోడు వస్తే ఇక ఈ సినిమా విడుదల అయ్యే రోజున మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా థియేటర్లో కలిసి సినిమా చూస్తానని అంటున్నాడు షారుఖ్ ఖాన్. చరణ్ షారుఖ్ల మధ్య కూడా మంచి రిలేషన్ ఉంది. ఇక ఈ స్నేహం కారణంగా షారుఖ్ కండిషన్ ని చరణ్ ఓకే చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో బాద్షా ప్రమోషన్ చేయడం చూసే అవకాశం దొరుకుతుంది. ఇక దీనిపై రామ్ చరణ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.
Yeah if Ram Charan takes me!! https://t.co/LoaE4POU79
— Shah Rukh Khan (@iamsrk) January 21, 2023