బ్రేకింగ్: మయోసైటీస్ తరువాత ఫస్ట్ టైం మీడియా ముందుకు సమంత..బయట పడ్డ సంచలన నిజాలు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా స్టార్ హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకున్న సమంతకి ఉండే రేంజ్ , క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ స్పెషల్ అని చెప్పాలి . ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయినా కోలీవుడ్ హీరోయిన్ సమంత ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. రీసెంట్ గానే సమంత నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది సమంత .

అప్పటినుంచి సోషల్ మీడియాలో సమంత త్వరగా కోలుకోవాలని .. ఆమె ఇదివరకు లా సినిమాలు చేయాలి అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆమెకు మెసేజెస్ పెడుతున్నారు . ఆమె త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా న్యూ ఇయర్ సందర్భంగా సమంత పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది . కాగా రీసెంట్గా సమంత ఎయిర్ పోర్ట్ లో కనిపించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మయోసైటీస్ వ్యాధి తర్వాత సమంత బాడీలో చాలా చేంజస్ వచ్చినట్లు ఈ వీడియోతో బయటపడింది .

సమంత వాకింగ్ స్టైల్, బాడీ లోని చేంజెస్ క్లియర్ గా ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. అంతేకాదు సమంత మునుపుటి కంటే ఇప్పుడు చాలా నిరసించిపోయి ..బక్క చిక్కిపోయి కనిపించింది . ముఖంలో కలలేకుండా లాగేసినట్లు కనిపిస్తుంది . ఈ క్రమంలోనే సమంత వ్యాధి నుంచి కోలుకున్న ఇంకా ఆమె ఆ డల్ నెస్ నుంచి కోలుకోలేదు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . కాగా జనవరి ఆఖరి వారంలో సమంత తన నెక్స్ట్ షెడ్యూల్ ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు మీడియాలో సినివర్గాల నుంచి సమాచారం అందుతుంది..!!