తెలుగు సినిమా చరిత్రలోనే ఈరోజు ఎవరో ఊహించని అద్భుతమైన ఘనత సాధించిన రోజు. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమాల దృష్టికి తీసుకు వెళ్ళాడు. ఆ సినిమా తర్వాత రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీ స్టార్ గా తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంది. వీటితోపాటు అంతర్జాతీయ సినిమా ప్రపంచం దగ్గర నుంచి ఎన్నో బహుమతులను కూడా దక్కించుకుంది.
ఈరోజు ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాలోని ఈ పాటకు అంతర్జాతీయ అవార్డు రావడంతో టాలీవుడ్ మాత్రమే కాకుండా భారతదేశం మొత్తం ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. త్రిబుల్ ఆర్ టీమ్ ప్రస్తుతం ఈ బెస్ట్ మూమెంట్స్ ను ఆస్వాదిస్తుంది. రాజమౌళి, కిరావాణి ఈ అవార్డు గెలుచుకున్న తర్వాత ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అక్కడ స్థానిక మీడియాతో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
చరణ్- తారక్ మాట్లాడుతూ.. మార్వాల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇరిద్దరూ ఏ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు అని అడగగా.. ‘రామ్ చరణ్-ఎన్టీఆర్ లు ఐరన్ మ్యాన్ లేదా కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ లో నటించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు’. ‘అంతేకాకుండా ఇండియాలో కూడా ఎందరో సూపర్ హీరోలు ఉన్నారని. వారి స్టోరీలని మార్వెల్ గా తీస్తే ఎలా ఉంటుందని రామ్ చరణ్ కూడా అన్నారు’. ప్రస్తుతం ఆస్కార్ లో ఈ సినిమా విజయం పై సినీ ప్రముఖులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఆస్కార్ కల నెరవేరుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.