ఇండస్ట్రీలో సినిమా పోటీపై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య..!

2023 సంక్రాంతికి ఊహించని విధంగా నాలుగు పెద్ద సినిమాలు ఒక చిన్న సినిమా విడుదలవుతూ ఉండడంతో ఈ సినిమాల మధ్య పోటీ ఒక రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానున్న వీర సింహారెడ్డి సినిమాకి కూడా రికార్డు స్థాయిలో బుకింగ్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ షోలకు టికెట్లు దొరకడం లేదని అభిమానుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా.. టికెట్లు మాత్రం దొరకడం లేదు.. దీన్నిబట్టి చూస్తే సినిమాపై హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా తాజాగా సంక్రాంతి పోటీ గురించి బాలయ్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ఉదయభానుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్ హీరో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఓకే బ్యానర్ లో తెరకెక్కిన రెండు సినిమాలు ఒక్కరోజు తేడాలో థియేటర్లలో విడుదల కావడం చరిత్రలోనే తొలిసారి అని బాలయ్య తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కు ఈ విధంగా ఒక రికార్డు దక్కింది అని ఆయన చెప్పుకు వచ్చారు. నిర్మాతలు మాట్లాడుతూ.. డైరెక్టర్ల మధ్య హీరోల మధ్య అనుకూలమైన వాతావరణం ఉందని కామెంట్లు చేశారు.

అంతేకాదు రెండు సినిమాల ఫలితాల విషయంలో తమకు నమ్మకం ఉంది అని.. ఆ రీజన్ వల్లే ఒక్కరోజు గ్యాప్ లో ఈ రెండు సినిమాలను విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ రెండు సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధిస్తాయని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య మాట్లాడుతూ.. పోటీ లేకుండా ఏ రంగంలో మజా ఉండదని అర్థం వచ్చేలా కామెంట్లు చేశారు. పోటీ ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుందన్నట్లుగా బాలయ్య వెల్లడించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.