రివ్యూ..వీర సింహారెడ్డి.. సినిమా ఎలా ఉందంటే..?

నటసింహ బాలకృష్ణ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా నటించిన చిత్రం వీర సింహారెడ్డి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక మాస్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం నందమూరి అభిమానులలో పూనకాల తెప్పించే విధంగా భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలయ్యింది. అఖండ సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై నందమూరి అభిమానులు ఎంతో ఆత్రతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమా గురించి ట్విట్టర్ జనాలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం.

వీర సింహారెడ్డి చిత్రం పైన కొంతమంది నెగటివ్ కామెంట్స్ చేయగా మరి కొంతమంది పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ మాస్ జాతర చేస్తున్నారని ఫస్ట్ ఆఫ్ సూపర్ గా ఉందని యాక్షన్ సీన్స్ తో బాలయ్య రచ్చ చేశారని మరి కొంతమంది అభిమానులు ట్విట్టర్లో తెలియజేస్తున్నారు. మరి కొంతమంది అయితే బాలయ్య ఈసారి కూడా బ్లాక్ బాస్టర్ అందుకున్నారంటూ తెలియజేస్తున్నారు. మొన్న అఖండ ఈరోజు వీరసింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు బాలయ్య అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి జై బాలయ్య అంటూ థియేటర్లో దద్దరిల్లిపోయేలా అభిమానులు కోలాహలం చేస్తున్నట్లుగా సమాచారం. మరి కొంతమంది మాత్రం ఈ సినిమాకు అంతలేదు అంటూ కూడా ట్వీట్లు చేస్తున్నారు. మరి కొంతమంది సింహా లెజెండ్ వంటి సినిమాల మిక్సీలో వేసి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది శృతిహాసన్ యాక్టింగ్ బాగానే ఉందంటూ బాలయ్య ఎప్పటిలాగే అరుపులు కేకలతో ఈ సినిమాలో కనిపిస్తున్నారు. మరి పాటలు బాలయ్య ఎనర్జీకి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతోందో చూడాలి మరి.