వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన నారా లోకేష్..!

2023 సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద పోటీ టాలీవుడ్ లో ఎంతటి ఉత్కంఠ రేకెత్తిస్తోందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు బిగ్గెస్ట్ క్లాష్ కి సిద్ధమవుతున్నాయి. అంతేకాదు ఈ రెండు సినిమాలు కూడా ఒకే బ్యానర్ పై మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై విడుదలవుతుండగా.. రెండింటిలో కూడా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఎలాగో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ఈరోజు ఉదయం విడుదలైన విషయం తెలిసిందే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన థియేటర్లలోకి రానుంది.

ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ఈ రెండు చిత్రాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ..” బాల మావయ్య.. చిరంజీవి గారు నటించిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు నా శుభాకాంక్షలు. ఈ రెండు చిత్రాల మాస్ ఎంటర్టైన్మెంట్ ని ఆస్వాదించేందుకు లక్షలాది అభిమానులతో నేను కూడా జాయిన్ అవుతాను. అయితే ఈ రెండు చిత్రాలని అడ్డుపెట్టుకొని ఫ్యాన్ వార్స్ సృష్టించడానికి.. కులాల మధ్య చిచ్చు రగిలించేందుకు అధికార పార్టీ నుంచి కొన్ని దుష్టశక్తులు సిద్ధంగా ఉన్నాయి.

ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ తో ఒక కమ్యూనిటీని మరో కమ్యూనిటీని రెచ్చగొట్టేలా పోస్ట్లు పెడతారు. అలాంటి అకౌంట్స్ పై రిపోర్ట్ చేయండి.. వాళ్ల ట్రాప్ లో మీరు పడవద్దు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే దీనికి ఎటువంటి హద్దులు ఉండవు. మనమంతా ఒక్కటే.. కులం , మతం, ప్రాంతం మనల్ని విడదీయలేవు అంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ట్విట్టర్ వేదిక ద్వారా ఈయన షేర్ చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://twitter.com/naralokesh/status/1613163843131437056?s=20&t=q-UP5ZyQckDjwoi34EutHA