దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్- ఎన్టీఆర్ కలిసి నటించిన త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకు అంతర్జాతీయ సినీ ప్రపంచం దగ్గర నుంచి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ సినిమా అప్డేట్స్ వైరల్ గా మారాయి.
వీటితో పాటు ఈ సినిమాలో హీరోలుగా నటించిన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ గురించి కూడా తెగ చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ భార్యల ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో కూడా వైరల్ గా మారింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుక సందర్భంగా ఉపాసన మరియు లక్ష్మీ ప్రణతి కూడా తమ భర్తలతో అక్కడ సందడి చేశారు. ఉపాసన అచ్చ తెలుగు చీర కట్టుతో అక్కడ వారిని ఆకట్టుకోగ.. లక్ష్మీ ప్రణతి మోడ్రన్ డ్రెస్ లో సందడి చేసింది.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్లతో కలిసి ఉన్న ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు కాకుండా ఉపాసన మరియు లక్ష్మీ ప్రణతి తీసుకున్నా ఓ సెల్ఫీ కూడా ఇప్పుడు ఎంతో వైరల్ గా మారింది.
ఆ సెల్ఫీ ని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి తీయగా.. ఆ ఫోటోకు సోషల్ మీడియాలో ఇద్దరు స్టార్స్ వైప్స్ అంటూ ఈ ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు.
రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఎప్పుడూ రెగ్యులర్గా తనకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి మాత్రం చాలా రేర్ గా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం ఇద్దరు కలిసి కనిపించిన అరుదైన పిక్ మాత్రం అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంది.