ఇంట్రెస్టింగ్: రష్మికకు హ్యాట్రిక్ ఛాన్స్‌.. ఈసారి కూడా సక్సెస్‌ రిపీట్ చేస్తుందా..!?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్‌గా పరిచయమైంది రష్మిక మందన్న‌. కన్నడ పరిశ్రమలో తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని తర్వాత తెలుగులో ఛ‌లో సినిమాతో పరిచయమై వరుస విజయాలతో దూసుకుపోయింది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకుని బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సౌత్ సినిమాలుకు దూరంగా ఉంటూ బాలీవుడ్ సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది.

రీసెంట్ గానే రష్మిక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో నటించిన వారసుడు సినిమా కూడా ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా రష్మిక సినిమాలపై ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక తెలుగులో ఛ‌లో సినిమాతో పరిచయం అవ్వ‌గా ఆ సినిమాని వెంకీ కుడుముల తెర‌కెక్కించాడు. ఆయన తర్వాత సినిమా భీష్మలో కూడా రష్మి కానే నటించింది. ఇక ఇప్పుడు వెంకీ కుడుముల చేయబోయే తర్వాత సినిమాలో కూడా రష్మిక మందన్న‌ హీరోయిన్‌గా నటించ బోతున్నట్టు తెలుస్తుంది.

Nithiin, Rashmika Mandanna starrer Bheeshma launched. See pics - Hindustan  Times

ఇప్పుడు మళ్లీ హ్యాట్రిక్ కోసం ఇద్దరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను మార్చిలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. నితిన్ ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ వారు ఈ సినిమాను ప్రొడ్యూస్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో మిషన్ మజ్ను, యానిమల్, పుష్పది రూల్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.