తెలుగు ప్రేక్షకుల ముందుకు ఇప్పటివరకు ఎన్నో టాక్ షోలు వచ్చాయి. ఇప్పటివరకు ఏ షోకు రాని రెస్పాన్స్ బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి వచ్చింది. ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా దూసుకుపోతుంది. ఇప్పటికే తొలి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్ కూడా ఎవరు ఊహించని రీతిలో టాక్ షోలకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే విధంగా బాలయ్య అదరగొడుతున్నాడు.
ఇక ఇప్పటికే రెండో సీజన్లో 7 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుని మరో రెండు రోజుల్లో ఎనిమిదో ఎపిసోడ్ కూడా రాబోతుంది.
ఈ సీజన్ లో సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా బాలయ్య షోలో సందడి చేశారు. తెలుగు టాక్ షోలకు దూరంగా ఉండే ప్రభాస్ ను కూడా బాలయ్య ఈ షోకు తీసుకువచ్చి రచ్చ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ షోకు మరో క్రేజీ గెస్ట్లు రాబోతున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ షోకు రామ్ చరణ్ మరియు కేటీఆర్ గెస్ట్లుగా రాబోతున్నారట.
ఈ ఎపిసోడ్కు సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ ఇప్పటికే ఈ షోకు ఓకే చెప్పగా కేటీఆర్ డేట్లు కేటాయించాల్సి ఉంది. ఇక ఆయన ఎప్పుడు డేట్లు కేటాయిస్తే ఆ రోజున షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సీజన్లో ఎవరూ ఊహించని ప్రత్యేకమైన గెస్ట్లు ఎందరో వచ్చారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ మరియు కేటీఆర్ కూడా ఈ షోకు వస్తే బాలయ్య క్రేజ్ మరింత పెరగటం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
కేటీఆర్ ఒక రాజకీయ నాయకుడు అయిన ఆయన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉంటారు. బాలయ్య షోలో కేటీఆర్ వస్తే కచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రామ్ చరణ్ కూడా బాలయ్యతో సందడి చేస్తే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం బాలయ్య- పవన్ ఎపిసోడ్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ఎపిసోడ్ ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ కానుందని నిన్న ఆహా ప్రకటించింది. ఈ ఎపిసోడ్ తర్వాత రామ్ చరణ్- కేటీఆర్ ఎపిసోడ్ ఉంటుందా లేదా ఇంకా ముందు వస్తుందా అనేది చూడాలి.