పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటు రాజకీయాలు అటు సినిమాలు రెండు బ్యాలెన్స్ చేస్తూ పవన్ దూసుకుపోతున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే తనకు గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ హిట్ అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేయబోతున్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు.
అయితే ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘తేరి’ సినిమాకు అఫీషియల్ రీమేక్గా హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించునున్నారట. ఇక దీంతో ఈ సినిమా రీమేక్ అని తెలియడంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎలా తెరకెక్కుతుంది అంటూ ఎంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్న సీనియర్ దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ.. ‘ప్రధానంగా కోలీవుడ్ తేరి సినిమా యొక్క కథాంశాన్ని మాత్రమే తీసుకుంటున్నామని, మిగతాదంతా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు’.
‘అలానే హరిష్ శంకర్ గతంలో పవన్తో చేసిన గబ్బర్ సింగ్ సినిమాను మించేలా ఇందులో పవన్ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండబోతుంది. ఈ సినిమాలో డైలాగ్స్, సాంగ్స్, యాక్షన్ అన్ని అంశాలపై పక్కాగా శ్రద్ధ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించనున్నారని.. ఈ సినిమా తప్పకుండా అందరి అంచనాలను అందుకుంటుందని టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న టాక్’. కాగా ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్స్ ని కూడా త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.