ఆల్ హ్యాపీస్ అనుకుంటున్న టైంలో పెంట పెంట చేసిన కొరటాల..మైండ్ దొబ్బిందా..?

“తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది” అన్నట్లు ఎట్టకేలకు కొరటాల శివ నుండి గుడ్ న్యూస్ వచ్చినా సరే ..అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మండించే న్యూస్ గానే తయారయింది . ఎస్ ప్రజంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తారక్ ప్రజెంట్ తన సినిమాలకు సంబంధించిన అప్డేడ్స్ విషయంలో వెనక పడ్డాడు అంటున్నారు జనాలు. గత ఏడాది ఆర్ ఆర్ ఆర్ ఖాతాలో వేసుకున్న తారక్..అప్పటినుంచి తన సినిమాకి సంబంధించిన విషయాలను పెద్దగా పట్టించుకోవట్లేదు అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి .

మరీ ముఖ్యంగా అప్పుడెప్పుడో ఎన్టీఆర్ థర్టీ అంటూ ఫాన్స్ కి ఓ అప్డేట్ ఇచ్చినా..ఆ తరువాత దాని ఊసే లేదు. కొత్త సంవత్సరంలో కొత్త అప్డేట్ ను అందించి సోషల్ మీడియాలో హ్యూజ్ గురవుతున్నాడు కొరటాల శివ. ఇన్నాళ్లు నిద్రపోతున్న కొరటాల శివ.. ఎట్టకేలకు నిద్ర లేచి ఎన్టీఆర్ థర్టీ కి సంబంధించిన షూటింగ్ ని మొదలుపెట్టడానికి సిద్ధపడ్డాడు అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు . న్యూ ఇయర్ సందర్భంగా కొరటాల శివ ఎన్టీఆర్ థర్టీ సినిమా ని ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభమవుతుందని అఫీషియల్ గా తెలియజేశాడు .

అంతేకాదు పనిలో పని రిలీజ్ డేట్ ను కూడా చెప్పేసాడు . ఏప్రిల్ 5న 2024న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు. అక్కడే అసలు తలనొప్పి స్టార్ట్ అయింది . 2023 ఫిబ్రవరిలో సినిమా స్టార్ట్ చేస్తే 2024 ఏప్రిల్ లో రిలీజ్ చేస్తావా..? నీ మైండ్ దొబ్బిందా..? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనకు డైరెక్ట్ గా కామెంట్స్ పెట్టేస్తున్నారు. సినిమా షూటింగ్ లేటైనా త్వరగా రిలీజ్ చేసి ఎన్టీఆర్ ను థియేటర్స్ లో తీసుకొస్తావనుకుంటే..మొత్తం పెంట పెంట చేసేసావ్ కొరటాల అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ టైం లోనే ఆల్ హ్యాపీస్ అనుకుంటున్నా టైంలో కొరటాల ఇలాంటి అప్డేట్ ఇచ్చి అభిమానులను మరింత నిరాశ పడేలా చేశాడు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.