ఇయర్ స్టార్టింగ్ లోనే బిగ్ బాంబ్ పేల్చిన సమంత .. అభిమానులకు కన్నీళ్ళు తప్పవా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి తప్పుకుందా..? అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు . మనకు తెలిసిందే బాలీవుడ్లో ఆఫర్స్ కోసమే సమంత.. నాగచైతన్య కి విడాకులు ఇచ్చిందన్న రూమర్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది .

ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో ఎంత బోల్డ్ గా నటించిందో సమంత అందరికీ తెలిసిన విషయమే. ఇక తర్వాత అదే రేంజ్ లో బాలీవుడ్ లో మరో వెబ్ సిరీస్ కు సైన్ చేసింది సమంత అంటూ వార్తలు వినిపించాయి . బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ – సమంత కలిసి సిటాడిల్ అనే వెబ్ సిరీస్ ను స్టార్ట్ చేశారు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి, ఈ సినిమా కోసం ఏకంగా మూడు నెలలు అమెరికాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నింది సమంత అంటూ కూడా బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి .

కాగా రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె అనారోగ్యం కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ ఎంటర్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఒకవేళ ఇదే నిజమైతే కొత్త సంవత్సరంలో బిగ్గెస్ట్ ఎదురుదెబ్బ పడింది సమంతకి అంటున్నారు జనాలు. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో సమంతకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సమంత నోరు విప్పితే కానీ అసలు నిజం బయటపడదు..?