మెగాస్టార్ కి మైండ్ దొబ్బిందా..? ఆ డైరెక్టర్ తో సినిమానా..? వద్దు బాబోయ్ వద్దు..!!

టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి రీసెంట్ గానే వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . సైలెంట్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్లు దక్కించుకుని టాలీవుడ్ లో సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది . అంతేనా ముఠామేస్త్రి టైంలోని మెగాస్టార్ చిరంజీవిని మళ్ళీ జనాలకు చూపిస్తూ మెగా ఫాన్స్ కు కొత్త ఊపునిచ్చాడు డైరెక్టర్ బాబి . ఈ క్రమంలోనే ఇప్పటికీ వాల్తేరు వీరయ్య సినిమా హ్యూజ్ కలెక్షన్స్ అందుకుంటూ టాలీవుడ్ లో సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతుంది .

 

కాగా ఇలాంటి టైం లోనే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా తర్వాత చేయబోయే డైరెక్టర్ ఎవరా..? అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది . అయితే అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి..వి వి వినాయక్ డైరెక్షన్లో మరో సినిమాకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా కూడా రీమేక్ సినిమా గానే తెరకెక్కుతుందట . తమిళ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విశ్వాసం సినిమాను చిరంజీవి తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఆల్రెడీ తెలుగులోనూ డబ్ అయ్యి పాజిటివ్ హిట్ అందుకుంది .

మరి ఇదే సినిమాను చిరంజీవి తెరకెక్కిస్తే జనాలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించరు . కాస్తో కూస్తో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాని హిట్ చేయాలి తప్పిస్తే ..రియల్ గా ఈ సినిమా హిట్ అవ్వదు. ఆ విషయం చిరంజీవికి తెలుసు. మరి ఎందుకు చిరంజీవి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అంతే కాదు ఎందుకు ఈ మధ్యకాలంలో మెగాస్టార్ ఎక్కువ రీమేక్ సినిమాల పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి .

ఏది ఏమైనా సరే చిరంజీవి కొంచెం ఆలోచించి మెగా ఫాన్స్ ఎలాంటి సినిమాలు చేస్తే ఇష్టపడతారా..? అని థింక్ చేసి అలాంటి సినిమాలు చేస్తే చూడాలి అన్నది మెగా అభిమానుల కోరిక. దీంతో విశ్వాసం సినిమా వద్దు బాబోయ్ వద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు . చూడాలి మరి దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?