టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ప్రారంభించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. యంగ్ బ్యూటీ శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్మడైపోయాయట.
ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ వారు మహేష్-త్రివిక్రమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఏకంగా రూ. 18 కోట్లు చెల్లించి మరీ దక్కించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా షూటింగ్ పూర్తి కాకముందే ఈ సినిమాకు ఇంత డిమాండ్ ఏర్పడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.