`క్రాక్` సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ గోపీచింద్ మలినేని.. రీసెంట్ గా `వీర సింహారెడ్డి` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇందులో హీరోగా నటించగా.. శృతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూ వచ్చాయి. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వసూళ్లను రాబడుతోంది. ఇకపోతే గోపీచంద్ మలినేని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అన్నది ఆసక్తికరంగా మారగా.. ఓ స్టార్ హీరో పేరు తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గోపీచంద్ మలినేని పవన్ కళ్యాణ్ పై కన్నేశాడట. వీర సింహారెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ మలినేని ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.
క్రాక్ తర్వాత బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కోసం రెండు కథలు రెడీ చేశానని అన్నారు. నాకు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అంటే వీర అభిమానం.. బాలకృష్ణతో సినిమా పూర్తైంది. పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేసుకున్న కథ కూడా బావుంటుంది. త్వరలోనే ఆయన్ను కలుస్తాను.` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కొందరు నెటిజన్లు పవన్ తో సినిమానా..? వద్దు బాబోయ్ అంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు.. పవన్ ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఆయనతో సినిమాను ప్రకటిస్తే ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియడం లేదు. పవన్ తో రెండేళ్ల క్రితం క్రిష్ స్టార్ట్ చేసిన `హరి హర వీరమల్లు` ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే పవన్ తో సినిమా వద్దంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.