ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత విలన్ గా మారింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓవైపు విలన్ గా మరియు సహాయక పాత్రలను పోషిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇందులో శ్రుతి హాసన్ హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా చేశారు. అలాగే వరలక్ష్మి ఇందులో బాలయ్య చెల్లెలుగా నటించింది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా బాలయ్య తర్వాత లేడీ విలన్ గా వరలక్ష్మి పాత్ర బాగా పండింది.
ఇకపోతే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా `వీర సింహారెడ్డి` టీమ్ బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` టాక్ షోలో పాల్గొన్నారు. అయితే ఈ షోలో పాల్గొన్న వరలక్ష్మికి బాలయ్య బంపర్ ఆఫర్ ఇచ్చారు. వీర సింహారెడ్డిలో చెల్లెలుగా చేశావ్.. ఏదో ఒక రోజు తనతో హీరోయిన్ గా చేసే అవకాశం ఇస్తానని బాలయ్య మాటిచ్చారు. `అన్స్టాపబుల్ స్టార్టింగులో నీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఏదో ఒక రోజు మన ఇద్దరం హీరో హీరోయిన్లుగా సినిమా చేద్దాం. వీర సింహా రెడ్డిలో చెల్లిగా చేశావ్, త్వరలో చెలిగా సినిమా చేద్దాం` అని బాలకృష్ణ పేర్కొన్నారు. దీంతో వరలక్ష్మి ఫుల్ ఖుషి అయిపోయింది.