`వీర‌య్య‌` ఈవెంట్‌కు శ్రుతి డుమ్మా.. రాకుండా బెదిరించారేమో అంటూ చిరు సెటైర్లు!

ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`, నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` చిత్రాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్రైలర్స్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఒంగోలులో వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆదివారం సాయంత్రం విశాఖలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. చిరంజీవి, రవితేజ ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఈ ఈవెంట్ కు శృతిహాసన్ డుమ్మా కొట్టింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శ్రుతి హాసన్ రాకపోవడంపై చిరు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాట్లాడుతూ.. `ఈరోజు ఈవెంట్ కు శ్రుతి అనుకోకుండా డ్రాప్ అయింది. ఒంగోలులో ఏం తిందో ఏమో కానీ ఆమెకు జ్వరం వచ్చిందంట.

లేక ఈవెంట్ కు రాకుండా ఎవరైనా బెదిరించారేమో తెలియదు` అంటూ సరదాగా బాలయ్యను ఉద్దేశిస్తూ చిరు సెటైర్లు పేల్చారు. `ఆరోగ్యం బాగాలేదని చెప్పింది కాస్త నలతగా ఉందని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని.. బహుశా కోవిడ్ టెస్ట్ పాజిటివ్ రాకుండా ఉంటే బాగుండు అని శృతి తెలిపింది. ఆమె త్వరగా కోలుకోవాలని అందరి తరపున కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఆమె బాగా నటించింది. గ్లామర్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ మరియు కథలోనూ ఆమె భాగమైంది` అంటూ చిరు చెప్పుకొచ్చారు. దీంతో శ్రుతి కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.