టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్గా ఒక వెలుగు వెలిగిన పూరి జగన్నాథ్ ఈమధ్య కాలంలో పెద్దగా తను తెరకెక్కించిన సినిమాలన్నీ ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో పూరి జగన్నాథ్ కెరియర్ ఒక్కసారిగా తలకిందులు అయిందని చెప్పవచ్చు. ఇంతవరకు పూరి జగన్నాథ్ తన సరికొత్త సినిమాని ఇంకా ప్రకటించలేదు. చిరంజీవి లాంటి వాళ్లతో ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని చిరంజీవికి స్టోరీ తన దగ్గర లేదంటూ స్కిప్ కొడుతున్నారని వార్తలు కూడా వినిపించాయి.మరి ఇప్పుడు పూరి జగన్నాథ్ ఎంచుకుంటున్న మార్గం ఏమిటి అనే విషయంపై పలు వార్తలు వినిపిస్తున్నాయి.
పూరి జగన్నాథ్ తన కుమారుడితో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూరి తనయుడు కోసమే సీరియస్ గా ఒక కథ రాస్తున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం బ్యాంక్ కు కూడా వెళ్లలేదు.. గోవా బీచ్ కి వెళ్లకుండా కేవలం తనకిష్టమైన కేఫ్ లోని కూర్చుని కథ రాస్తున్నట్లుగా సమాచారం. పగలుపూట పనుకోవడం రాత్రి సమయాలలో కథను రాయడం వంటివి చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్ కథలు ఎప్పుడూ కూడా నైట్ టైం లోనే రాస్తూ ఉంటారని సమాచారం.
పూరి జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత కొంతకాలం రిలాక్స్ గా పనిచేయడం అలవాటు నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు రిలాక్స్ అయితే లైఫ్ చాలా రిస్క్ లో పడుతుందని భావించి మళ్లీ పాత పద్ధతిలోనే కథలను రాసి తానే సొంతంగా తీయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆకాష్ కోసమే ఈ కథ సిద్ధం చేయడానికి మరో నాలుగు నెలల సమయం పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో నైనా పూరి తన కొడుకు ఆకాష్ జీవితం మారిపోతుందేమో చూడాలి.