ఆ విషయంలో అబ్బాయిని ఫాలో అవుతున్న బాబాయ్..సక్సెస్ అయ్యే నా..!

గత సంవత్సరం నందమూరి ఫ్యామిలీ టాలీవుడ్ లోనే తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. నందమూరి బాలకృష్ణ నుంచి మొదలుకొని కళ్యాణ్ రామ్ వరకు సూపర్ సక్సెస్ తో దూసుకుపోయారు. ముందుగా బాలకృష్ణ అఖండ సినిమాతో విజయ పరంపరను మొదలుపెట్టగా… తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా త్రిబుల్ ఆర్ సినిమాతో ఈ విజయ విహారాన్ని మరో లెవల్ కు తీసుకెళ్లాడు. ఇక వీరితోపాటు కళ్యాణ్ రామ్ కూడా గత సంవత్సరం బింబిసారా సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని గత సంవత్సరం మొత్తం నందమూరి నామ సంవత్సరం చేసేసారు.

Kalyan Ram reunites Balayya and Jr NTR!

ఈ సంవత్సరం కూడా ఈ నందమూరి హీరోలు వరుస‌ సినిమాలతో బిజీగా ఉన్నారు. ముందుగా వారిలో నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒంగోలులో ఎంతో గ్రాండ్‌గా జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఈవెంట్ లో బాలకృష్ణ చేసిన ఓ పని ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతుంది. స్టేజ్ పై బాలయ్య గ‌త సినిమాలకు సంబంధించిన వీడియోలు ప్రసారమవుతున్న సమయంలో కుర్చీలో కూర్చున్న బాలయ్య ఆ సినిమాలుకు డైలాగ్స్ చెబుతూ ఎక్స్ప్రెషన్ ఇస్తూ కనిపించారు.

అయితే గతంలో కూడా పలు ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే విధంగా చేశారు. ఇప్పుడు ఈ విషయంలో ఈ నందమూరి హీరోలు సేమ్ టు సేమ్ అని కామెంట్లు కూడా వస్తున్నాయి. వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాలయ్య ఖాతాలో రూ.100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించిన తొలి సినిమాగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బాలకృష్ణ కూడా ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని కూడా కామెంట్లు వస్తున్నాయి.

వీరసింహారెడ్డి సినిమాల్లో కూడా బోయపాటి మార్క్‌ డైలాగ్స్ ఉండటం అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఎక్కువ ర‌న్‌టైమ్‌తో ఈ సినిమా రిలీజ్ కానుండగా అతి త్వరలోనే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తికానుంది. వీర‌సింహారెడ్డి సినిమా థియేటర్ల సంఖ్యకు సంబంధించిన పూర్తిస్థాయి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. వీర‌సింహారెడ్డి సినిమాతో బాలయ్య మరో సెన్సేషనల్ హిట్ అందుకుంటారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా తో బాలకృష్ణ ఎలాంటి సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.