అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి రాబోతున్న చిత్రం `వీర సింహారెడ్డి`. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. శృతిహాసన్, హనిరోజ్ హీరోయిన్లుగా నటించారు. తమన్ స్వరాలు అందించాడు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ మాస్ ఎంటర్టైనర్ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకు పట్టుమని వారం రోజులు కూడా లేదు. ఇలాంటి తరుణంలో ఈ చిత్రానికి బిగ్ టాస్క్ వచ్చి పడింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సినిమా ఫస్ట్ కాపీ ఇంకా సిద్ధవం కాలేదట.
ఆ పనుల్లో తమన్ బిజీగా ఉండటం వల్లే.. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోయాడు. మరో ప్రక్క 11న ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు ఉన్నాయి. అయితే ఇంకా ఫస్ట్ కాపీ సిద్ధం కాకపోవడంతో మేకర్స్ కు పెద్ద టెన్షన్ పట్టుకుందట. ఫస్ట్ కాపీ రెడీ అవ్వాలి, ఆ తరవాత సెన్సార్కు పంపాలి.. ఆ తరవాతే.. ఓవర్సీస్కు ప్రింట్లు పంపాల్సి ఉంటుంది. అనుకొన్న సమయానికి ఈ పనులు పూర్తి అవటం అనేది పెద్ద టాస్కే. అందుకే వీరసింహారెడ్డి చిత్ర టీమ్ కి టెన్షన్ మొదలైందని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.