జ‌గ‌న్ కు ఇచ్చిప‌డేసిన బాల‌య్య‌.. హాట్ టాపిక్‌గా మారిన `వీర సింహారెడ్డి` డైలాగ్‌!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మాస్‌ ఎంటర్టైన జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను ఒంగోలు వేదికగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై మ‌రింత హైప్‌ను పెంచింది.

అయితే ఈ ట్రైలర్ లో ఒక డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. `సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ, ఆ చరిత్ర సృష్టించినవాడి పేరు మారదు.. మార్చలేరు..` అంటూ బాల‌య్య ట్రైల‌ర్ ఓ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ ను వ‌దిలారు. ఇప్పుడంతా ఈ డైలాగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. కొన్నాళ్ళ క్రితం ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా వైఎస్‌ జగన్ ప్రభుత్వం మార్చిన విషయం తెలిసేంది.

అప్పట్లో ఇది పెద్ద వివాదం అయింది. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ అంశాన్ని ఉద్దేశిస్తూనే బాల‌య్య `వీర సింహారెడ్డి` డైలాగ్ ద్వారా జ‌గ‌న్‌పై చుర‌క‌లు వేశాడ‌ని అంటున్నారు. జ‌గ‌న్ కు దిమ్మతిరిగేలా బాల‌య్య ఇచ్చేప‌డేశాడ‌ని ప‌లువురు నెట్టింట చ‌ర్చించుకుంటున్నారు.