దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచ సినిమాల స్థాయికి వెళ్ళింది. ఆ సినిమాల దగ్గర నుంచి టాలీవుడ్ లో వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే వస్తున్నాయి. టాలీవుడ్ లో ఉన్న ప్రతి దర్శకుడు తాను చేసే సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసేందుకు ఎంతో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నానికి యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల మనే బేధం లేకుండా వారు కూడా ఆ ప్రయత్నానికి సపోర్ట్ ఇస్తున్నారు.
ఇప్పటికే బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తాను చేసే ప్రతి సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. ఆ సినిమాలకు గాను ప్రభాస్ అందుకునే రెమ్యూనిరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. మన తెలుగు చిత్ర పరిశ్రమంలోనే రూ.100 కోట్ల భారీ రెమ్యూనరేషన్ అందుకున్న ఏకైక హీరో ప్రభాస్ అనటంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఇప్పుడు ఈ జాబితాలో మరో హీరో చేరాడు. రామ్ చరణ్ కూడా త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత నుంచి తాను చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చరణ్ సేషనల్ డైరెక్టర్ శంకర్ సినిమాలో బిజీగా ఉండగా.. ఈ సినిమా తర్వాత చేయబోయే బుచ్చిబాబు సినిమా కోసం రామ్ చరణ్ 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభాస్ రామ్ చరణ్ మాత్రమే ఈ ఇప్పటివరకు టాలీవుడ్ లో ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్న హీరోలుగా రికార్డుల్లోకి ఎక్కుతారు.