`వీర సింహారెడ్డి` ఐటమ్ సాంగ్ అప్డేట్ వ‌చ్చేసింది.. ఇక స్పీకర్ లు పగిలిపోవాల్సిందే!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీరసింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే మేక‌ర్స్‌ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకు వదులుతూ సినిమాపై హైప్‌ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి జై బాలయ్య, సుగుణ సుందరి సాంగ్స్ బయటకు వచ్చే విశేష ఆదరణను అందుకున్నాయి. అయితే తాజాగా వీరసింహారెడ్డి లోని ఐటమ్ సాంగ్ లాంచ్ కు మేకర్స్ ముహూర్తం పెట్టేశారు.

`మా బావ మనోభావాలు` అంటూ సాగే ఈ ప్రత్యేక గీతం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న 3 గంటల 19 నిమిషాలకు బయటకు రాబోతోంది.`న్యూ ఇయర్ పార్టీలలో స్పీకర్ లు పగిలిపోవాలా, థియేటర్లలో మోత మోగిపోవాలా` అనే క్యాప్షన్ తో మేకర్స్ ఈ ఐటమ్ సాంగ్ అప్డేట్ ను బయటకు వదిలారు. కాగా, ఈ ఐటమ్ సాంగ్ కి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు.. ఈ పాటలో బాలకృష్ణ మాస్ స్టెప్పుల‌తో అదరగొట్టేశాని టాక్‌ వినిపిస్తుంది. న్యూ ఇయర్ వేడుకల్లో ఈ పాట మోగేలా ఉంటుంది అంటున్నారు మేకర్స్.

https://twitter.com/MythriOfficial/status/1605429490532122629?s=20&t=ZuF11erro9ncbETI76i3EQ