`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.
అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో ముందు నుంచి సస్పెన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొరటాల చాలామంది హీరోయిన్లను సంప్రదించారు. కానీ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరు మంది హీరోయిన్లు ఎన్టీఆర్ కు నో చెప్పారట. ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మొదట ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. ఆమె దాదాపు ఫైనల్ అయిందని ప్రచారం జరిగింది. కానీ అంతలోనే అలియా భట్ గర్బం దాల్చడంతో ఆమె సున్నితంగా ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట.
ఆ తర్వాత కియారా అద్వానీని సంప్రదించగా డేట్స్ సద్దుబాటు చేయలేక ఎన్టీఆర్ సినిమాను తిరస్కరించిందట. దాంతో మేకర్స్ దీపికా పదుకొనే ను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారట. కానీ ఆమె ప్రభాస్ తో `ప్రాజెక్ట్-కె`తో బిజీగా ఉండటం కారణంగా నో చెప్పిందట. ఆ తర్వాత కీర్తి సురేష్, పూజా హెగ్డే, జాన్వీ కపూర్ లను సంప్రదించారట. వీరు సైతం పలు కారణాల వల్ల ఎన్టీఆర్ 30 సినిమాను వదులుకున్నారట. ఇక అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ జాన్వీ కపూర్ వద్దకే ఈ ఆఫర్ వెళ్ళిందట. మొదట నో చెప్పిన జాన్వీనే మళ్ళీ ఈ మూవీపై ఇంట్రెస్ట్ చూపిందట. దాదాపు జాన్వీనే ఇందులో హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు ప్రచారం జరుగుతుంది.